వ్యవసాయ గణనను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్

by Kalyani |
వ్యవసాయ గణనను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్
X

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : 11వ వ్యవసాయ గణనను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అండగా ఉంటూ.. క్షేత్రస్థాయిలో తిరిగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో 11వ వ్యవసాయ గణన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణకు హాజరైన వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఏఓ, ఎంఏవో, ఏవోలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..11వ వ్యవసాయ గణన పకడ్బందీగా నిర్వహించి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 92 క్లస్టర్ గ్రామాలు ఉన్నాయని, సంబంధిత అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ..రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో రైతు వేదికలు నిర్వహించాలన్నారు. వ్యవసాయంలో రైతులకు లాభసాటిగా ఉండే పంటల మీద అవగాహన కల్పించాలన్నారు. రైతులకు సంబంధించిన అన్ని అంశాలను తెలియపరుస్తూ.. సమాచారం డాటా ట్యాబ్ ఎంట్రీలో తప్పకుండా పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా అధికారి శామ్యూల్, ఎస్ ఓ రాజమ్మ, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, అసిస్టెంట్ డైరక్టర్ అగ్రికల్చర్ అధికారి నీలిమ, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.



Next Story