కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి

by Naresh |
కార్పొరేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి
X

దిశ, మోత్కూరు: నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని కేఆర్ భవన్‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాకముందే వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రం తోపాటు మోత్కూరు మండల కేంద్రాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని చేస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, వెంటనే సంబంధిత డీఐఈవో డీఈఓ స్పందించి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలు, పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సూరారం కళ్యాణ్, మోత్కూర్ మండల నాయకులు, మచ్చ వినయ్, వంశీ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed