- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పసికందును హత్య చేసిన నిందితుడు అరెస్ట్, రిమాండ్...

దిశ, చివ్వెంల : 22 నెలల పసికందును క్రూరంగా హింసించి, హత్య చేసిన నిందితుడు బొళ్ళెంక అరవింద రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. డీఎస్పీ జి. రవి తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం గుండారం గ్రామానికి చెందిన నవ్య శ్రీ గత సంవత్సరం క్రితం భర్త లక్ష్మణ్ తో గొడవ పెట్టుకొని దూరంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డితో 7 నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తన సొంత తల్లిగారు అయిన సాటాపూర్ గ్రామంలో నివాసం ఉంటుంది.
గత 20 రోజుల క్రితం సాటాపూర్ గ్రామానికి అరవింద్ రెడ్డి తన ద్విచక్ర వాహనంపై వెళ్లి నవ్య శ్రీ తో పాటు తన ఇద్దరు కూతుర్లను ఎక్కించుకొని ఐలాపురం గ్రామంలోని పరుశురాం ఇంట్లో అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఈనెల 11 మంగళవారం రోజున సాయంత్రం సమయంలో నవ్య శ్రీ స్నానం చేస్తున్న సమయంలో మహాన్వి కూలర్ పై కూర్చోబెట్టి కింద పడేశాడు. దీంతో కిందపడి మొహానికి తలపై గాయం తగిలి ఉండడంతో మెట్ల నుంచి కింద పడ్డదని అబద్ధం ఆడి నవ్య శ్రీ తో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ తీసుకెళ్లారు.
ఇప్పటికే మహన్వి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఐలాపురం తీసుకువచ్చి అక్కడనుండి అరవింద్ రెడ్డి పారిపోయారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అరవింద్ రెడ్డిని గురువారం మధ్యాహ్న సమయంలో తన బైకు తీసుకెళ్లడానికి ఐలాపురానికి రాగా రూరల్ సీఐ సురేందర్ రెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. నిందితుడు అరెస్ట్ కు సహకరించిన ఎస్ఐ వెంకటరెడ్డి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.