- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు

దిశ,నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. అదే క్రమంలో నల్లగొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఆరుగురు మధ్యవర్తులను వారు విచారణ చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసే అధికారి కారుకే నెంబర్ ప్లేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మాట్లాడుతూ డీటీసీలో అవకతవకలు ఏజెంట్ల ద్వారా జరుగుతున్నాయని పలువురి ద్వారా, అలాగే మీడియా ద్వారా ఫిర్యాదు వచ్చినట్టు తెలిపారు. ఆర్సీ, లైసెన్స్ కోసం వచ్చిన వారిని ఇక్కడ ఆరుగురు ఏజంట్లను పెట్టుకొని అధికారులు కర్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఏజెంట్ల వద్ద 60 దరఖాస్తు లు దొరికినట్టు తెలిపారు. లంచాలు అడిగిన వారి మీద కంప్లైంట్ చేయాలంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. ఏజెంట్ల వద్ద రూ. 12,500 దొరికినట్టు చెప్పారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రామారావు, వెంకటేశ్వర రావు, ఏసీబీ సిబ్బంది 12 మంది పాల్గొన్నారు.