లారీ బైక్ ఢీకొని ఓ మహిళ మృతి

by Naresh |
లారీ బైక్ ఢీకొని ఓ మహిళ మృతి
X

దిశ, కోదాడ: లారీ బైక్ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమర బండ 65వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా గురజాల గ్రామానికి చెందిన యాగంటి లక్ష్మి (55) తన భర్తతో కలిసి సూర్యాపేటలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి తన స్వగ్రామం వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో కొమరబండ వద్ద జాతీయ రహదారిపై వెనక నుంచి లారీ ఢీ కొట్టడంతో లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed