జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి

by Naveena |
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారి భువనగిరి‌ మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పక్కనే ఉన్న గాంధీపురం గ్రామం వెంకట్రాం తండాకు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాయిగిరి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి లారీని వెనక‌ నుంచి ఢీ‌ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అనూష (25) ఆమె‌ కూతురు చైత్ర (5) అక్కడిక్కడే మృతి చెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న భర్త భూక్య సంతోష్ కు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కారులో వెనక సీట్లో కూర్చున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారి భువనగిరి‌ మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.



Next Story

Most Viewed