- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గురుకుల పాఠశాల విద్యార్థినిల మరణాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

దిశ, సూర్యాపేట : గత 20 రోజుల్లోనే భువనగిరి యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో వరుసగా 4 గురు విద్యార్థినిలు మరణించడం చాలా బాధాకరం. ఆ విద్యార్థినిల మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించక పోవడం బాధకరమని ప్రముఖ న్యాయవాది, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తళ్లమల్ల హసేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోడ శ్రీరాములు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపిలు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి వారు కాసేపు ధర్నా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అకాల మరణం పొందిన విద్యార్థినిల కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇచ్చి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో విద్యార్థులకు సైక్రాయటిక్ వైద్యునితో కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు.
జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు హాస్టల్స్ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసు కోవాలని సూచించారు. కాలయాపన చేయకుండా వారి మరణాలకు కారకులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్, లంబాడి హక్కుల జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్, ఎమ్మార్పీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు వల్లంపట్ల దయానంద్, మాల న్యాయ వాదులు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏడేండ్ల అశోక్, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు అనుముల పూరి రామకృష్ణ, మల్లేష్, కళ్యాణ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.