డ్రైవర్ నిర్లక్ష్యానికి స్కూలు విద్యార్థి బలి

by Disha Web Desk 23 |
డ్రైవర్ నిర్లక్ష్యానికి స్కూలు విద్యార్థి బలి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి శివారులో డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గా విషాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన వడ్డే మోని అభిలాష్ (8). .పోచంపల్లిలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగా ఉదయం తండ్రి వడ్డే మోనీ శ్రీనివాస్ అభిలాష్ ని స్కూల్ బస్ ఎక్కించారు. హాఫ్ డే స్కూల్ కాబట్టి అభిలాష్ మధ్యాహ్నం తిరిగి అదే బస్ లో ఇంటికి వచ్చే క్రమంలో భీమన పల్లి శివారు చెరువు కట్ట రోడ్డు వద్ద బస్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్,డోర్ లాక్ వేయక పోవడం వల్ల అభిలాష్ బస్ లోంచి ప్రమాద వశాత్తూ కింద పడి పోయాడు.స్కూల్ బస్ వెనక టైర్ అతని పొట్ట మీదనుంచి వెళ్ళటంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సైది రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పంచ నామ చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అల్లారు ముద్దుగా ఉన్న తమ గారాల కొడుకు కళ్ళ ముందే రక్తపు మడుగులో విగత జీవిగా ఉండటాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించి రోదించారు.గ్రామ ప్రజలందరూ శవమై ఉన్న బాలుణ్ణి చూసి కన్నీరు మున్నీరయ్యారు.


Next Story