అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల సీజ్

by Kalyani |
అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల సీజ్
X

దిశ,మోత్కూరు: ప్రభుత్వ అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలో అధికారులు గురువారం సీజ్ చేశారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి వీపురి శ్రీధర్ నోడల్ అధికారి టి గోపాల్ రెడ్డిలు పాఠశాల సీజ్ వేయడంతోపాటు ఉపాధ్యాయులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి కావద్దని కోరారు.



Next Story

Most Viewed