- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేల కూలిన విద్యుత్ స్తంభం…పట్టించుకోని సంబంధిత అధికారులు

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలోని గాజుల్లమల్కాపురం గ్రామంలో గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఉన్న చెట్టును కొట్టడంతో విద్యుత్ స్తంభం నేలకూలి విద్యుత్ తీగలు భూమి మీద పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ సంఘటన గ్రామంలోని స్మశాన వాటిక వద్ద చోటుచేసుకుంది. గత పది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఉన్న చెట్టును కొట్టివేయడంతో విద్యుత్ స్తంభం మీద పడి స్తంభం విరిగి నేల పైన పడింది. దీంతో విద్యుత్ తీగలు భూమిపై ఆనుకొని ఉండడంతో స్మశానానికి వెళ్లే వారికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇన్ని రోజులు అవుతున్న విద్యుత్ అధికారులు కానీ, చెట్టును కొట్టిన రైతు గాని పట్టించుకోకపోవడం శోచనీయం గా మారింది. విద్యుత్ స్తంభాన్ని తొలగించి తీగలను తీసి వేయకపోతే ఆ ఫీడర్ కు వచ్చే విద్యుత్ సరఫరా వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని పలువురు రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిళ్లక ముందే వెంటనే స్తంభాన్ని తీసివేసి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ వైర్లను తొలగించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.