- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బావిలో పడి వ్యక్తి మృతి
by Naveena |

X
దిశ, వేములపల్లి : ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆమనగల్లు గ్రామానికి చెందిన బంటు సైదులు (37), చెన్నబోయిన విటల్ లు చలి చీమలపాలెం రెవెన్యూ శివారులోని బావిలో మోటర్ ను బయటకు తీయడానికి వెళ్లారు. కాగా మోటారు బయటకు తీసే ప్రయత్నంలో సైదులు ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story