ఇంటింటి జ్వర సర్వే పక్కాగా నిర్వహించాలి

by Sridhar Babu |
ఇంటింటి జ్వర సర్వే పక్కాగా నిర్వహించాలి
X

దిశ,చౌటుప్పల్ : ఇంటింటి జ్వర సర్వే పక్కాగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఓపీ వివరాలను, మందుల స్టాక్, పంపిణీ వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య కేంద్రం డాక్టర్ కాటం రాజు ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట మెడికల్ క్యాంప్ పెట్టాలని సూచించారు. ఫీవర్ సర్వేలో గుర్తించిన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేసి దాని ప్రకారం వైద్య సహాయం అందించాలని, అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలని సూచించారు.

అదేవిదంగా దోమల నివారణకు కృషి చేయాలని, నీటి నిల్వ గుంతలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఆయిల్ బాల్స్ వినియోగించాలని, సీజనల్ వ్యాధుల నిర్మూలనకు అవసరమైన అన్ని పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరనాయక్, మండల అభివృద్ధి అధికారి కె.ప్రమోద్ కుమార్ కు సూచించారు. అనంతరం దామెర గ్రామపంచాయతీలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా ఆరోగ్య కేంద్ర భవనం పూర్తి చేసి అప్పగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరు నితీష్ కు సూచించారు. చింతలగూడెంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేసిన పనులను పరిశీలించారు.

మూడవ తరగతి విద్యార్ధులతో ఇంగ్లిషు, లెక్కలు చదివించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్బిణీలు, పిల్లలు ఎంత మంది వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం గుడ్లు, బాలామృతం తనిఖీ చేసి సరఫరా పంపిణీ వివరాలను పరిశీలించారు. పిల్లల బరువు, ఎత్తు చెక్ చేశారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మధ్యాహ్నం పూట అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తినేలా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని, మాతా శిశు సంరక్షణ, పోషకాహార లోపం వలన కలిగే దుష్పరిమాణాలు, పోషకాహారం తీసుకుంటే కలిగే ఆరోగ్య ఫలితాలను తల్లులకు తెలియచెప్పాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.



Next Story

Most Viewed