- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూగబోయిన తెలంగాణ ఉద్యమ స్వరం..

దిశ, శాలిగౌరారం : తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా నకిరేకల్ లో ఉద్యమాన్ని ఉర్రూతులూగించిన వేముల నరేష్ అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం తెల్లవారుజామున నరేష్ భౌతిక ఖాయనికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం వేముల నరేష్ స్వగ్రామమైన శాలిగౌరారం మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఆయన భౌతిక కాయానికి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, జీడీ భిక్షం, అన్నెబోయిన సుధాకర్, అయితగోని వెంకన్న గౌడ్, వేముల అనుదీప్, వేముల గోపీనాథ్, మద్దెల సందీప్, మానుకోట ప్రసాద్ పలువురు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేముల పుష్ప ఆధ్వర్యంలో కళాకారులతో పెద్ద ఎత్తున అంతిమ యాత్ర నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఏపూరి సోమన్న, గిద్దె రామ నర్సయ్య, పెరాల యాదగిరి, కప్పల వసంత, భిక్షపతి, పల్స నిర్మల, సాయి, ధనశేఖర్, ఎర్ర అనుదీప్, వేణు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు