ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కేసు

by Kalyani |
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కేసు
X

దిశ, నిడమనూరు : ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఎర్రబెల్లి గ్రామానికి చెందిన భరపటి రాజేశ్వరి (24)ని అదే గ్రామానికి చెందిన సింగారపు రాజశేఖర్ సంవత్సరం నుంచి ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని,శారీరకంగా లొంగదీసుకున్నడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని అడుగగా విషయం దాటవేయగా, పెద్దల సమక్షంలో రాజేశ్వరి కుటుంబ సభ్యులు పెళ్లి విషయం అడగ్గా అందుకు నిరాకరించాడు. ప్రేమించి మోసం చేసిన రాజశేఖర్ పై ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ రమేష్ తెలిపారు.



Next Story

Most Viewed