- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
75 ట్రాక్టర్ల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక సీజ్

దిశ, చింతలపాలెం:- అక్రమంగా నిల్వ చేసిన 75 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్టు చింతలపాలెం తాహసిల్దార్ తుమ్మల సురేందర్ రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల రెవెన్యూ పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానది నుండి అక్రమంగా ఇసుకను డంపు చేసి అమ్ముతున్నారని మా దృష్టికి రావడం జరిగిందని అన్నారు. చింత్రియాల గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందించగా వారు తనిఖీలు నిర్వహించగా సుమారు 75 ట్రాక్టర్ల నిల్వ ఉంచిన ఇసుకను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఇసుకను చింతిర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కి అప్పగించడం జరిగింది. ఈ అక్రమ ఇసుక నిర్వహణను ఎవరు నిర్వహిస్తున్నారు అని స్థానికులను అడగగా ఎటువంటి సమాచారం లభించలేదు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి వెంట ఆర్ ఐ సైదా పాల్గొన్నారు.