30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

by Kalyani |
30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
X

దిశ, చింతలపాలెం : అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడిన ఘటన చింతలపాలెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… చింతలపాలెం గ్రామానికి చెందిన షేక్ లాల్ సాహెబ్ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఒక ఇంట్లో రహస్యంగా 30క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంటి వద్ద 30 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగినదని విలేకరుల సమావేశంలో తెలిపారు.



Next Story

Most Viewed