- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
by Naveena |

X
దిశ, చింతలపాలెం: చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామంలో సోమవారం రాత్రి గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. యజమాని ఆనంగి వెంకయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తను గొర్రెలను రోజువారీగా సాయంత్రం వరకు అడవిలో మోపుకొచ్చి తన ఇంటి ఎదురుగానున్న గొర్రెల దొడ్డిలో పెట్టి పడుకున్నానని తెలిపారు. రాత్రి సమయంలో కొన్ని కుక్కలు వచ్చి దొడ్డిలో ప్రవేశించి.. గొర్రెలపై దాడి చేయగా 20 గొర్రెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ దాడితో తనకు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తనను ఆదుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో వీధి కుక్కల నివారణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు.
Next Story