మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ అప్పుడే

by Disha Web Desk 19 |
మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ అప్పుడే
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 14వ తేదీన నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీగా ప్రకటించారు. 17వ తేదీ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. 6వ తేదీన కౌంటింగ్ జరగనుండగా.. అదే రోజున తుది ఫలితాలు వెలువడునున్నాయి. కాగా, ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేటికి అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగతుండగా.. కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.





Next Story

Most Viewed