సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మాజీ MP బూర

by Disha Web Desk 19 |
సీఎం రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మాజీ MP బూర
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ కూలిపోతుందోనని కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు సాధిస్తుందని.. మరోసారి మోడీ భారత ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని ఈ సంద్భంగా బూర సవాల్ విసిరారు. కాగా, భువనగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. బీజేపీ తరుఫున మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక, బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడు క్యామ మల్లేష్‌కు ఎంపీ టికెట్ ఇచ్చింది.

Next Story

Most Viewed