దేశ్ కీ నేత ఎక్కడ..? కేసీఆర్‌పై MP Bandi Sanjay సెటైరికల్ ట్వీట్

by Disha Web Desk 19 |
దేశ్ కీ నేత ఎక్కడ..? కేసీఆర్‌పై MP Bandi Sanjay సెటైరికల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సన్నాహక సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అటెండ్ అవ్వకపోవడంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటున్న టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. ఎందుకంటే కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు. అలాగే దాని మిత్రపక్ష ఎంఐఎం కూడా ఎస్కేప్ అయిందని విమర్శించారు. ఇది సిగ్గు చేటు అని ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మరోవైపు, జీ20 సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండడంపై 'దేశ్ కీ నేత ఎక్కడ? అంటూ బీజేపీ సెటైర్లు వేస్తుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని.. సమావేశానికి కూడా హాజరు కాలేదంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read more:

బిగ్ బ్రేకింగ్ న్యూస్: MLC కవిత లేఖకు సీబీఐ రిప్లై.....విచారణ తేదీని ఫిక్స్ చేసిన CBI అధికారులు

నేను KCR కంటే ఎక్కువ చదివా: MLA Rasamayi Balakishan సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed