'ఈటలకు దమ్ముంటే మళ్లీ రాజీనామా చేసి గెలవాలి'

by GSrikanth |
ఈటలకు దమ్ముంటే మళ్లీ రాజీనామా చేసి గెలవాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈటలకు దమ్ముంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఎన్నో హామీలు ఇచ్చారని.. తట్టెడు మట్టి అయినా తీశారా.. కేంద్రం నిధులు తెచ్చారా... లక్ష రూపాయల సీసీ రోడ్డు వేయించారా అని ప్రశ్నించారు. మునుగోడు ఫలితంపై ఈటల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం గురించి ఈటల మాట్లాడటం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ హత్య రాజకీయాలను మునుగోడుకు తేవాలని ఈటల ప్రయత్నించాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడా గొడవలు జరగలేదని కేవలం ఈటల అత్తగారి ఊర్లోనే ఎందుకు గొడవలు జరుగుతాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఈటల చంపాలని కుట్ర పన్నారని ఆరోపించారు. రాజేందర్ నేర చరిత్ర హుజురాబాద్ ప్రజలకు బాగా తెలుసని, ఆయన పీఏ దగ్గర దొరికిన డబ్బు గురించి ఎందుకు మాట్లాడరు? అన్నారు. ఈటలవి నల్లికుట్ల రాజకీయాలు చేస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ మునుగోడులో దించిన బుల్లెట్‌కు బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపారు. బీజేపీ నేతలు కేసీఆర్ గురించి మాట్లాడితే హైద్రాబాద్ నుంచి ఉరికిస్తామని హెచ్చరించారు. వివేక్ డబ్బుల రాజకీయం మునుగోడులో పని చేయలేదన్నారు.



Next Story

Most Viewed