టీఆర్ఎస్ కీలక సమావేశానికి కవిత డుమ్మా.. వెల్లువెత్తుతున్న అనుమానాలు

by Dishafeatures2 |
టీఆర్ఎస్ కీలక సమావేశానికి కవిత డుమ్మా.. వెల్లువెత్తుతున్న అనుమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఈరోజు అంత్యంత కీలకంగా నిలుస్తోంది. రాష్ట్ర స్థాయి పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను జాతీయ స్థాయి పార్టీగా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో కన్ఫార్మ్ చేశారు. అయితే ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలంతా హాజరైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత మాత్రం గైర్హాజరు కావడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీ ప్రకటన వేడుకలకు ఆమె రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ రంజిత్ రెడ్డి సైతం కాలి గాయం కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే కవిత మాత్రం సిటీలో అందుబాటులోనే ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అనౌన్స్ మెంట్ సమావేశానికి రాకపోవడంపై తెలంగాణ భవన్ వద్ద గుసగుసలు వినిపించాయి. జాతీయ పార్టీ విషయంలో తండ్రీకూతుళ్లకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే చర్చ గుప్పుమంది.


Next Story

Most Viewed