- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రగతి భవన్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!
దిశ, తెలంగాణ బ్యూరో: నర్సాపూర్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ను అధినేత కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వబోననే సంకేతం ఇచ్చారు. సునీతాలక్ష్మారెడ్డిని ప్రచారం చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. అయితే మదన్ రెడ్డి పార్టీపై గుర్రుగా ఉండటంతో ఇప్పటికే ఒకసారి ప్రగతిభవన్కు పిలిపించి మాట్లాడారు. అయినా పోటీకే మొగ్గుచూపుతుండటంతో మదన్ రెడ్డిని శాంతిపజేసేందుకు గురువారం ప్రగతిభవన్కు పిలిపించి కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం.
పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో శుక్రవారం మరోసారి రావాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అయితే మదన్ రెడ్డితో కేటీఆర్ ఏం మాట్లాడుతారు? ఏం హామీ ఇస్తారనేదిమాత్రం సస్పెన్స్. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్గా నైనా పోటీచేసేందుకు మొగ్గు చూపుతున్న మదన్ రెడ్డి...పార్టీ ఇచ్చే ఆఫర్ కు ఏ మేరకు కట్టుబడి ఉంటారో చూడాలి.