CM రేవంత్ రెడ్డికి సమన్లు.. మంత్రి ఉత్తమ్ ఘాటు రియాక్షన్ ఇదే..!

by Disha Web Desk 4 |
CM రేవంత్ రెడ్డికి సమన్లు.. మంత్రి ఉత్తమ్ ఘాటు రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ నోటీసులపై రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed