అసెంబ్లీలో కేసీఆర్ కాళ్ళకు నమస్కరించిన హరీశ్ రావు

by Disha Web Desk 2 |
అసెంబ్లీలో కేసీఆర్ కాళ్ళకు నమస్కరించిన హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించడానికి ముందు మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కు వెళ్ళారు. అక్కడ పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసెంబ్లీలోనే కాళ్ళకు మొక్కారు. చాలా సాదాసీదాగా లెదర్ బ్యాగ్‌లో బడ్జెట్ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు. సరిగ్గా పదిన్నర గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉండగా పావుగంట ముందే హాల్‌లోకి చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి, ఫోటోల కోసం ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపారు. ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ముందు కొద్దిసేపు ఏకాంతంగా బడ్జెట్ స్పీచ్‌ను చూసుకున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాల ద్వారా అందిన ఫలాల గురించి కామెంట్లు చేసేటప్పుడు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి మద్దతు పలికారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వచ్చి అభినందనలు తెలియజేశారు. తమ శాఖకు కేటాయింపులు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed