పది పరీక్షలు పాస్ అయ్యారా.. అయితే మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ మీకోసమే..!

by Disha Web Desk 4 |
పది పరీక్షలు పాస్ అయ్యారా.. అయితే మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ మీకోసమే..!
X

దిశ, హనుమకొండ టౌన్ : 10వ తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయిన విద్యార్థుల కోసం హన్మకొండలోని గౌతమ్ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. 10వ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం గౌతమ్ జూనియర్ కళాశాల 15 మంది విద్యార్థులకు రూ. 20 లక్షల మెరిట్ స్కాలర్ షిప్ అవార్డు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో మంచి కళాశాలలో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గౌతమ్ జూనియర్ కాలేజి నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ టెస్ట్‌లో మీ ప్రతిభను రుజువు చేసుకొండి.

10-05-24 శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు పదవ తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయిన విద్యార్థుల కోసం గౌతమ్ జూనియర్ కళాశాల మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించిన మొదటి 5 విద్యార్థులకు ఐఐటీ, నీట్ (ప్రైమ్ బ్యాచ్)లో, తరువాత 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్+ఎమ్సెట్ (లియో బ్యాచ్)లో, తరువాత 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ (జనరల్ బ్యాచ్)లో మొత్తం 15 మంది విద్యార్థులకు రూ. 20 లక్షల విలువైన 2 సంలు ఐఐటీ & నీట్, ఎమ్సెట్, ఇంటర్‌లలో హాస్టల్‌తో కూడిన విద్యను పూర్తిగా ఉచితంగా ఇచ్చుటకు గౌతమ్ జూనియర్ కాలేజి మీ ముందుకు వచ్చింది, కావున 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాలేజ్ యాజమాన్యం కోరారు. స్కాలర్‌షిప్ టెస్టు రాయలనుకునేవారు పూర్తి వివరాలకు 9393444808, 9100666804, 7995424666 నంబర్లకు ఫోన్ చేయాలని యాజమాన్యం కోరింది.

Next Story