- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ, టీఆర్ఎస్ లను ఓడించేది బహుజనవాదమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ,శామీర్ పేట : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ను ఓడించే బలం కలిగిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్థంతి సందర్భంగా మూడు రోజుల రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వేల ఏళ్లుగా బహుజనులు ఎలా అణిచివేయబడ్డారో, ఎలా మోసానికి గురయ్యారో బహుజనులకు అర్థమైన రోజు ఆ పార్టీలు నామరూపం లేకుండా పోతాయని పేర్కొన్నారు. ఇంతకాలం బహుజనులకు వారి చరిత్రను చెప్పలేదని, వారికి జరిగిన అన్యాయాన్ని వివరించలేదని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులకు వారి చరిత్రను బోధించి వారికి జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ వారి న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. బహుజన రాజ్యాన్ని సాధించడమే అంబేద్కర్ కి మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ తరగతుల ద్వారా బహుజన సిద్ధాంతం బోధించి ప్రజలను చైతన్య పరచడం ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణం అభివృద్ధి పరిచి బహుజన రాజ్యాధికారానికి దారులు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఛీప్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్,మహిళా కన్వీనర్ అనితా రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.