- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత సైనికులను చూసి గర్వపడుతున్నాం.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి

దిశ, కుత్బుల్లాపూర్ : దేశం కోసం పోరాడుతున్న భారత సైనికులకు చూసి గర్వపడుతున్నాం అని రాష్ట్ర మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ (మల్లారెడ్డి హెల్త్ సిటీ ) లో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న దేశ సైనికులకు శనివారం సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు చామకూర మల్లారెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే కేపీ వివేకానందలు ముఖ్యఅతిథులుగా హాజరై ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని వీరమరణం పొందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెర్రరిస్టులు మతం పేరు అడిగి మరీ కాశ్మీర్ లోని పెహల్గాంలో ప్రజల్ని చంపండం దేశ ప్రజల మనస్సులను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం జరుగుతున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి మనమంతా ఒక్కటే అనే నినాదంతో కలిసికట్టుగా ముందుగా నడుస్తూ ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధరంగంలో అవసరమైన వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ అన్ని విధాలుగా ముందు వరసలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు భారత మువన్నెల జెండాలు చేతబూని జైహింద్, జై భారత్ అంటూ నినాదాలు చేశారు.