భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి

by Dishafeatures2 |
భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి
X

దిశ, నాచారం: హబ్సిగూడ డివిజన్ లోని కామాక్షి పురంలో భూగర్భ డ్రైనేజీ పనులను హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేని చేతన హరీశ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హబ్సిగూడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే కామాక్షిపురంలో రూ.15 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లా చారి, సీనియర్ నాయకులు వేములకొండ వెంకన్న గౌడ్, పూజారి సోమయ్య గౌడ్, రఘు,సాయి, కామాక్షిపురం కాలనీ అధ్యక్షులు దుర్గేష్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, కోశాధికారి శ్రీనివాస్,తుమ్మల రవి, రామ రత్నం, కమిటీ సభ్యులు కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


Next Story