దారి దోపిడీ ముఠా అరెస్ట్

by Disha Web Desk 15 |
దారి దోపిడీ ముఠా అరెస్ట్
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : అద్దెకు కార్లను తీసుకుంటారు.. రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుంటారు.. కారులో ఎక్కిన ప్రయాణికులను కత్తులతో బెదిరించి, వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. గోపాలపురం, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా ముఠా గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి మాట్లాడుతూ.. నిందితుల నుండి 13 సెల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తుల ముఠాను కటకటాల్లోకి తరలించినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఖలీల్, మహబూబ్ బాషా, అబ్దుల్ హసన్, మహమ్మద్ ఖాన్ అద్దెకు కార్లను తీసుకొని రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు తస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం కార్లను అద్దెకు తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. చిలకలగూడ నుండి సంగీత్ వైపునకు వెళ్తున్న క్రమంలో గోపాలపురం పోలీసులు ,నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేధించారు. వీరంతా గతంలో పలు నేరాలలో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. కార్లను అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని డీసీపీ సూచించారు.


Next Story

Most Viewed