Eatala Rajender: టీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఈటల.. వారంతా బీజేపీ గూటికి

by Dishafeatures2 |
Choutuppal MPP Thaduri Venkat Reddy Joins BJP in The Presence Of Eatala Rajender
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ /శామీర్ పేట: Choutuppal MPP Thaduri Venkat Reddy Joins BJP in The Presence Of Eatala Rajender| భయపెడితే తెలంగాణ సమాజం లొంగదని హుజురాబాద్ శాసన సభ్యులు, బీజేపీ చెరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా, శామీర్ పేటలోని తన నివాసంలో మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్‌కు చెందిన ఎంపీపీ తాడురి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చిరెడ్డి,మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలకు వెల కడుతున్న నీఛమైన పార్టీ టీఆర్ఎస్ అని ఆరోపించారు.

సొంత పార్టీ నేతలను డబ్బులు పెట్టి కొనుగోలు చేసినందుకే హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించారని గుర్తు చేశారు. అయినా కేసీఆర్‌కి బుద్ది రాలేదని మండి పడ్డారు. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వెగటు పుట్టి ఆ పార్టీ నేతలు బయటకే వస్తున్నారని స్పష్టం చేశారు. అలా వచ్చే వారిపై సీఎం కేసీఆర్ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని, ఇలాంటి పిచ్చి వేషాలు వేయవద్దని కేసీఆర్‌కు సూచించారు.

భయపెట్టి లొంగ దీసుకుంటాం.. అంటే తెలంగాణ సమాజం లొంగదని ఈటల పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీయేనని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల ముందో..లేక తరువాతనో కలిసిపోతాయని ఈటల జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఇన్నేళ్లు పని చేశారు.. ఇంకో 6 నెలలు కష్టపడి పని చేయండి.. అధికారం మనదేనని ఈటల స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: అబిడ్స్‌లో కేసీఆర్ స్పీచ్ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రజలు


Next Story