- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 1.60 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం శంకుస్థాపన
by Taduka Kalyani |
అల్లాపూర్ డివిజన్ పరిధిలో 1.60 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం స్థానిక కార్పొరేటర్ సబీహ బేగంతో కలిసి శంకుస్థాపన చేశారు.

X
దిశ, కూకట్పల్లి: అల్లాపూర్ డివిజన్ పరిధిలో 1.60 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం స్థానిక కార్పొరేటర్ సబీహ బేగంతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. 85 లక్షలతో సున్నం చెరువు పార్క్, అభివృద్ధి పనులను, రూ. 75 లక్షల వ్యయంతో గాయత్రినగర్ షటిల్ కోర్టు ప్రాంగణంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అల్లాపూర్ డివిజన్లో డ్రైనేజి, తాగునీటి పైప్లైన్ పనులను, రోడ్డు పనులను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. డివిజన్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Next Story






