పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Disha Web Desk 21 |
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్​ డివిజన్​ పరిధిలోని కూకట్​పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన డయగ్నస్టిక్​ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను వదిలి నిర్మాణం చేపట్టడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​ పగుడాల శిరీష బాబురావు, వైద్య అధికారి డాక్టర్​ చందర్​ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed