దిశ ఎఫెక్ట్.. రోడ్డు ఆక్రమణలను తొలగించిన జీహెచ్​ఎంసీ అధికారులు

by Sumithra |
దిశ ఎఫెక్ట్.. రోడ్డు ఆక్రమణలను తొలగించిన జీహెచ్​ఎంసీ అధికారులు
X

దిశ, కూకట్​పల్లి : దుర్గంధానికి కేరాఫ్​ ధనలక్ష్మీ సెంటర్​ గ్రౌండ్​ పేరున దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందించిన జీహెచ్​ఎంసీ అధికారులు మంగళవారం గ్రౌండ్​ ముందు అక్రమంగా ఏర్పాటు దుకాణాలను తొలగించారు. ధనలక్ష్మి సెంటర్​ గ్రౌండ్​ ప్రహరికి ఆనుకుని వరుసగా కొంత మంది దుకాణాలను ఏర్పాటు చేయించి వారి వద్ద నుంచి రోజుకు ఇంత అంటు డబ్బులు వసూలు చేసి ధనలక్ష్మి సెంటర్​ గ్రౌండ్​ ప్రాంగణం అంత వ్యాపార కేంద్రంగా మార్చేశారు. దిశ పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందించిన జీహెచ్​ఎంసీ అధికారులు ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం ఆధ్వర్యంలో గ్రౌండ్​ ముందు రోడ్డును ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలు, డబ్బాలను తొలగించారు.



Next Story

Most Viewed