పూడూరు గ్రామ ప్రభుత్వ భూమిలో అగ్ని ప్రమాదం

by Aamani |
పూడూరు గ్రామ ప్రభుత్వ భూమిలో అగ్ని ప్రమాదం
X

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పూడూరు గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 608 సర్వేనెంబర్ లో ప్రభుత్వ భూమిలో వ్యర్థ పదార్థాలను పారబోశారు. వ్యర్థ పదార్థాల లో మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వడం తో ఏర్పడుతున్న గుంతలలో చుట్టుపక్కలున్న కంపెనీల వ్యర్థ పదార్థాలు పడేయడంతో అగ్నిప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story