మురుగునీటి శుద్ధికి ఎస్​టీపీ ప్లాంట్లు ఏర్పాటు : ఎమ్మెల్యే కృష్ణారావు

by Disha Web Desk 15 |
మురుగునీటి శుద్ధికి ఎస్​టీపీ ప్లాంట్లు ఏర్పాటు : ఎమ్మెల్యే కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి : మురుగు నీటిని శుద్ధి చేసి చెరువులను నీటితో నింపేందుకు నియోజకవర్గంలో ఎస్​టీపీ ప్లాంట్​లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్​ డివిజన్​ పరిధిలోని రేయిన్​బో విస్తాస్​ వద్ద నిర్మిస్తున్న ఎస్​టీపీ ప్లాంట్​ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఎమ్మెల్సీ కె. నవీన్​ కుమార్​తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎస్​టీపీ ప్లాంట్​లు అందుబాటులోకి వస్తే చెరువులలో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడవచ్చునని, అదే విధంగా చెరువు సమీపంలోని కాలనీలలో దోమల బెడద తగ్గుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పార్కులు, ఓపెన్​ జిమ్​లు, ఇండోర్​ స్టేడియంలు, షటిల్​ కోర్టులు, క్రీడా మైదానాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు తదితరులు పాల్గొన్నారు.


Next Story