రేపు ఈ కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

by Dishafeatures2 |
రేపు ఈ కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
X

దిశ, దుండిగల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొమ్మరపోచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో రేపు (ఫిబ్రవరి 3) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని దొమ్మరపోచంపల్లి ఏఈ సామల సురేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెయింటనెన్స్ పనుల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలగనుందని చెప్పారు. 11 కేవీ ఏజిఎల్, ఐడీఏ కేబుల ఫీడర్, ఐడీఏ డిపి పల్లి, సత్యం ఫీడర్, గండిమైసమ్మ ఫీడర్, ఏజీఎల్ బౌరంపేట పరిధిలోకి వచ్చే దొమ్మరపోచంపల్లి, సారేగుడెం, రాజరాజేశ్వరి కాలని, అపురూప కాలని, ఆంధ్రా బ్యాంక్, శ్లోక స్కూల్, ప్రగతి మోడల్ స్కూల్, గండిమైసమ్మ చౌరస్తాలో ఈ నెల 3 న శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని దొమ్మరపోచంపల్లి ఏఈ సామల సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతరాయానికి చింతిస్తున్నామని అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Next Story