బయటకు వెళ్లిన యువతి అదృశ్యం

by Disha Web Desk 15 |
బయటకు వెళ్లిన యువతి అదృశ్యం
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : ఇంటి నుండి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్ పల్లి లో నివాసం ఉంటున్న హన్మంత్ రెడ్డి, రాజ్య లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె బార్ల దుర్గ లక్ష్మి (19) కొన్నిరోజుల క్రితం తన స్నేహితుడు అభి కి డబ్భులు అవసరం ఉండటం తో మధ్య వర్తిగా వ్యవహరించి మరో స్నేహితుడైన పవన్ సాయి అనే యువకుడి వద్ద ఆరు వేల రూపాయలు అప్పు గా తీసుకుని అభి కి సహాయం చేసింది. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పవన్ సాయి దుర్గ లక్ష్మిని అడగటం ప్రారంభించాడు.

దీంతో ఒత్తిడి తో ఇబ్బందులు పడుతున్న దుర్గ లక్ష్మి ని తన కాలేజ్ లెక్చరర్ గమనించి మందలించాడు. దీంతో జరిగిన విషయం ఆమె లెక్చరర్ కు వివరించింది. ఈ విషయాన్ని లెక్చరర్ దుర్గ లక్ష్మి తల్లి కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఓ విషయం లో ఒత్తిడికి లోమవుతుందని, అడిగి తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించాడు. దీంతో కూతురును తల్లి మందలించింది. అందుకు మనస్థాపం చెందిన దుర్గ లక్ష్మి శుక్రవారం ఉదయం బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. తన ఫోన్ పని చేయకపోవడం తో అనుమానం వచ్చిన తల్లి బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story