దొంగ‌ల బీభ‌త్సం.. ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి నగదు, బంగారం చోరీ

by Dishanational4 |
దొంగ‌ల బీభ‌త్సం.. ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి నగదు, బంగారం చోరీ
X

దిశ, పేట్ బషీరాబాద్: ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు బంగారన్ని దోచుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. చింతల్ డివిజన్ శివానగర్‌కు చెందిన మనోహర్ సాఫ్‌వేర్ ఉద్యోగి కాగా.. బహదూర్ పల్లిలో కొత్త ఇంటిని తీసుకున్నాడు. ఈ క్రమంలో కొత్త ఇంటిలో సామాను సర్దుకుంటానికి ఇంట్లో ఉన్న అందరూ శివానగర్‌లో వారు ఉంటున్న ఇంటికి తాళం వేసి వెళ్లారు. వారందరూ కొత్త ఇంటిలోనే రాత్రికి ఉండిపోయారు.

అయితే శివానగర్‌లో ఉన్న ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని.. అద్దెకున్నవారు ఫోన్లో చేయడంతో వారందరూ హుటాహుటిన పాత ఇంటికి చేరుకున్నారు. వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటుగా బెడ్ రూమ్‌లో ఉన్న బీరువా తెరిచి ఉంది. కబోర్డ్‌లో ఉంచిన 7లక్షల నగదుతో పాటుగా 10 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకుపోయారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed