మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎంపీ ఈటల రాజేందర్

by Kalyani |
మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ, కాప్రా: ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్యసేవలందించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఈసీఐఎల్ చౌరస్తా లోని ‘లైఫ్ లైన్ తులసి’ హాస్పిటల్ ను లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ నిరుపేదలకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. లైఫ్ లైన్ తులసి హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు, అనుభవజ్ఞులైన సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ వంటి అన్ని ప్రధాన విభాగాల్లోనూ ఇక్కడ వైద్య సేవలు లభిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర విభాగం, అత్యాధునిక అంబులెన్స్ సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని రాజ్ కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జయరాం రెడ్డి, ఎండి విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed