మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకోవాలని కురుమ సంఘం డిమాండ్

by Dishafeatures2 |
మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకోవాలని కురుమ సంఘం డిమాండ్
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకోవాలని మేడ్చల్ జిల్లా కురుమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ.. 30 శాతం ఉన్న కురుమ కులస్తులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ లేరని, ఉన్న ఒక్కమేయర్ ను దించేందుకు కుట్ర పన్నితే సహించేది లేదని, మేయర్ మేకల కావ్య పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెంటనే విరమించుకోవాలని వారు హెచ్చరించారు. బీసీ సామాజిక కులాలను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ కులానికి చెందిన మేయర్ పదవి పూర్తి కాలాన్ని కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed