- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు…గంటపాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో
by Kalyani |
![తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు…గంటపాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు…గంటపాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో](https://www.dishadaily.com/h-upload/2024/06/11/342056-11.webp)
X
దిశ, చిన్నశంకరంపేట : చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీవాసులు మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో చేగుంట--మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ… మంచినీరు రావడంలేదని ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో దామోదర్ ఘటన స్థలానికి చేరుకొని సమస్య పై మాట్లాడి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Next Story