ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్​దే అధికారం : పొన్నాల లక్ష్మయ్య

by Disha Web Desk 15 |
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్​దే అధికారం : పొన్నాల లక్ష్మయ్య
X

దిశ, కొండపాక : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలను గద్దెదించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్​దే అధికారం అని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు నేటి నుండి చేపట్టనున్న హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా మండలంలోని దర్గా గ్రామంలో హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఇంటింటి కీ తిరిగి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అసుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న పనులను గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా హస్తం పార్టీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యోగాల పేరిట మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులను నిరుద్యోగులు నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిందేమీలేదన్నారు. సంక్షేమ పాలన, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, కొండపాక మండల అధ్యక్షుడు వాసరి లింగారవు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, గజ్వెల్ నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు, గజ్వెల్ మల్లారెడ్డి , మనోహరబాద్ మల్లారెడ్డి, సంతోష్ కుమార్ ,రవీందర్ , శ్రీనివాస్ గుప్తా, శశిబూషన్, ఎర్రవల్లి ఎంపీటీసీ ప్రాణవి, కొండపాక మండల యూత్ అధ్యక్షుడు పార్శారములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లికార్జున్, గ్రామ, దర్గా గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed