ఒకే దూరం..రెండు రకాల చార్జీలు.. ఆర్టీసీ సిబ్బందితో గొడవ

by Disha Web Desk 4 |
ఒకే దూరం..రెండు రకాల చార్జీలు.. ఆర్టీసీ సిబ్బందితో గొడవ
X

దిశ, పాపన్నపేట: జిల్లా కేంద్రమైన మెదక్ నుండి పాపన్నపేట వరకు ఆర్టీసీ అధికారులు రెండు రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు. మెదక్ డిపో బస్సులో టికెట్ ధర రూ.25 కాగా.. నారాయణఖేడ్, జైరాబాద్ డిపో బస్సులో రూ.21 వసూలు చేస్తున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు కండక్టర్ తో గొడవ పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఒకేరకం చార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సమయానికి రాక ఆటోలపై ప్రయాణం చేస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.


Next Story

Most Viewed