జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మూడు నామినేషన్లు

by Disha Web Desk 15 |
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి మూడు నామినేషన్లు
X

దిశ, సంగారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. బి.మారుతిరావు, కె.ఆనందీశ్వర్ లు ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేయగా , రవి మహాదేవ్ స్వామి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఇంకా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సోమవారం నామినేషన్ వేయనున్నారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ 22వ తేదీన, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఈనెల 24వ తేదీన నామినేషన్ సమర్పించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed