- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
దిశ, చేగుంట : ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చేగుంట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆచరిస్ లిమిటెడ్ కంపెనీలో బీహార్ కు చెందిన రాం పర్వేష్(22) పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కంపెనీ నుండి బయటకు వెళ్లిన యువకుడు తిరిగి రాకపోయేసరికి వెతకడం ప్రారంభించారు. స్థానిక బైపాస్ బ్రిడ్జి సమీపంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో శవం ఉండడం గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిర్భూమి కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కరెంటు ట్రాన్స్ఫార్మర్ తగిలి మృతి చెందాడా లేదా ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.