ఓటు గల్లంతైందని సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన

by Naresh N |
ఓటు గల్లంతైందని సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన
X

దిశ, కొమురవెల్లి: కొమురవెళ్లి మండల కేంద్రంలో ఓటర్ లిస్టులో తన ఓటు గల్లంతైందని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, యువకుడు తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లికి చెందిన ముత్యం వెంకటేష్ ఓటర్ లిస్టులో తన పేరు రాలేదని గల్లంతైందని తెలుసుకొని నిరసన తెలిపాడు. వెంకటేష్ గత ఎన్నికలలో తన ఓటును వినియోగించుకోగా ఈ సారి ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఇది గమనించిన అధికారులు, పోలీసులు సర్దిచెప్పడంతో నిరసన విరమించాడు.

పెండ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రంకు...

మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన నూతన వరుడు తడుపునూరి వివేక్ పెండ్లి పందిరి నుంచి పోలింగ్ కేంద్రంకు నూతన వరుడు వివేక్ నూతన వధువు భావనతో కలిసి పోలింగ్ కేంద్రంకు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నూతన వరుడు వివేక్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రంకు పెండ్లి దుస్తులతో రావడంతో స్థానికులు, అధికారులు ఆసక్తిగా చూశారు.



Next Story

Most Viewed