- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బిడ్డల ఎదుగుదలే అమ్మకు వెలకట్టలేని సంతోషం : నీలం మధు

దిశ, పటాన్ చెరు : సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, మనకు కనిపించే దైవం మనను కని పెంచిన మాతృ మూర్తి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మే 12వ తేదీ అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపకులు యం రవికుమార్ శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో మరచిపోలేని పాత్ర పోషించిన మన అమ్మకు ప్రత్యేకం గా గౌరవం ఇచ్చే రోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అని అన్నారు. అమృతం ఉందో లేదో.. అది ఆయుష్షు పోస్తుందో లేదో తెలియదు కానీ.. "అమ్మ" మాత్రం తన ఆయుష్షును సైతం మనకే పోస్తుందన్నారు.
బిడ్డలుగా మనం నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటుందని మన బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుందని, జీవితాంతం పిల్లలే తన సర్వస్వం గా భావించే అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదని కొనియాడారు. మనల్ని కని, పెంచి, పెద్ద వాళ్లను చేసి మంచి భవిష్యత్తు ఇచ్చిన అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. బిడ్డల ఆనందమే తనకు వెలకట్టలేని సంతోషంగా జీవితాంతం ఆమె సర్వస్వాన్నీ బిడ్డల కోసం అర్పించే తల్లిని మించిన దైవం మరొకటి లేదని పునరుద్ఘాటించారు. నవమాసాలు మోసి కని పెంచి మనల్ని ప్రయోజకుల్ని చేసిన అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందన్నారు. తన తల్లి తనకు నేర్పిన ఓనమాలు, మంచి పనులతోనే తాను జీవితంలో ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. దురదృష్టం కొద్దీ తన తల్లిదండ్రులను ఒక్క రోజు వ్యవధిలో కోల్పోయానని కంట తడి పెట్టారు.
మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆడబిడ్డలలో నా మాతృ మూర్తిని చూసుకుంటున్నానన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులని ఆయన అభినందించారు. కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘానికి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, దివ్యాంగులు, సంగారెడ్డి డీ ఆర్ డీ ఏ ఏ పీ డీ జంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం,శిరీష, మెట్టు శ్రీధర్, ఎన్ శ్రీనివాస్, వి నారాయణ రెడ్డి, మన్నే రాఘవేంద్ర, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.