బోనమెత్తిన ఎల్గోయి

by Dishafeatures2 |
బోనమెత్తిన ఎల్గోయి
X

దిశ, ఝరాసంగం: ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప దేవత యంత్ర మూర్తి స్థిర విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి బోనాలు నైవేద్యం సమర్పించి మహా నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరా సగం ఎస్సై రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.





Next Story

Most Viewed