హస్తం నిరుపేదల నేస్తం

by Disha Web Desk 15 |
హస్తం నిరుపేదల నేస్తం
X

దిశ, గుమ్మడిదల : దేశంలోని నిరుపేదల నేస్తం హస్తం పార్టీ అని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇందిరమ్మ ప్రధానిగా ఉన్న సమయంలో మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దడంతో పాటు ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి నిరుపేదలకు ఉపాధి కల్పించిందని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ మోసపూరిత మాటలను నమ్మి మోసపోకుండా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

హస్తం గుర్తుకు ఓటు వేయండి అభివృద్ధికి పట్టం కట్టండి : నీలం మధు

కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి దేశ అభివృద్ధికి పట్టం కట్టాలని, తమ ఇంటి బిడ్డను గెలిపించుకోవాలని నీలం మధు కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బొల్లారంలో నిర్వహించిన ప్రచారంలో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటి వరకు పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలనను అందించడంతోపాటు అర్హులైన నిరుపేద ప్రజలకు పథకాలను అందిస్తుందని తెలిపారు.

తనను తన ఇంటి బిడ్డగా భావించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి దేశ అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్​చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, బొల్లారం వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి, నాయకులు చంద్ర రెడ్డి, ఐఎన్టియూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బొల్లారం మున్సిపల్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శంకర్ లతా సంతోష్, గోపాల్, రమణయ్య, గోపమ్మ, పరుశురాం, ఇమ్రాన్, బొల్లారం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed